Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను వేధిస్తున్నారు: ఏపీ గవర్నర్ కు చంద్రబాబు లేఖ

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (13:24 IST)
ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు లేఖ రాశారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన లేఖలో వాపోయారు. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ ఘటన మరవకముందే.. ప్రైవేట్‌ ఆస్పత్రి ఉద్యోగి అపర్ణను పోలీసులు అడ్డగించి వేధించారన్నారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఘటనపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.  ఆ లేఖ వివరాలు యధావిధిగా...
 
ఫ్రంట్‌లైన్ వారియర్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సంవత్సరం కు పైగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. 
కానీ, ఫ్రంట్ లైన్ యోధులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కరోనా ఇబ్బందులు, పరిస్థితుల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీత కన్నుతో వ్యవహరిస్తుంది.
2020 మే నెలలో విశాఖపట్నంలో దివంగత దళిత డాక్టర్ సుధాకర్ అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరచిపోక ముందు, విశాఖపట్నంలో మరో ఫ్రంట్ లైన్ యోధురాలుపై వేధింపులు వెలుగులోకి వచ్చాయి. 
విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న దళితురాలైన శ్రీమతి లక్ష్మి అపర్ణ  లాక్డౌన్ సడలింపు పని గంటల తర్వాత సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నారు. 
అయితే, పోలీసులు ఆమెను రామా టాకీస్ సమీపంలో అడ్డగించి, అనవసరమైన వేధింపులకు గురిచేశారు.
వైసీపీ ప్రభుత్వంలో ఒక వర్గం  పోలీసులు ప్రజాస్వామ్య ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు.
పర్యవసానంగా ఫ్రంట్‌లైన్ యోధులు, ప్రతిపక్ష నాయకులు, సామాన్య ప్రజానీకం, మరీ ముఖ్యంగా దళితులు వేధింపులకు గురవుతున్నారు, 
అయితే, ఇంతవరకు అలాంటి పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు లాంటి సంఘటనలు వలసరాజ్యాల పాలనను గుర్తుకు తెస్తున్నాయి.
కరోనా మహమ్మారి ప్రజలందరినీ అనేక ఇబ్బందులకు, తీవ్రమైన ఒత్తిడికి గురిచేసింది. 
ఇలాంటి పరీక్షా సమయాల్లో పోలీసులు అర్ధంలేని వేధింపులు కట్టిపెట్టి స్నేహపూర్వక పోలీసింగ్ చాలా అవసరం. 
రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్‌ను నిర్ధారించడానికి తప్పు చేసిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: చిరంజీవి గారు అదే ఫార్మాట్‌లో తీసి సక్సెస్ అయ్యారు : ప్రియదర్శి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసింది గద్దర్ : భట్టి విక్రమార్క మల్లు

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments