Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఎపుడు?

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (14:41 IST)
గత ఎన్నికల్లో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగా ఆయన 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో మహిళా సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఈ యేడాది బడ్జెట్‌లో రూ.4,285 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. 
 
పేదరికం కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేుటు పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ముఖ్యంగా, సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. అదేవిధంగా దీపం-2 పథకం ద్వారా గృహిణులకు ప్రతి యేటా మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 5 లక్షల మంది గృహిణులకు లబ్ది పొందుతున్నారని మంత్రి పయ్యావుల అసెంబ్లీలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments