Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

సెల్వి
శనివారం, 2 నవంబరు 2024 (15:31 IST)
ఒడిశా ప్రాంతానికి చెందిన దంపతులు.. తమ ఇద్దరు పిల్లలను తీసుకుని పొట్టచేత పట్టుకుని నర్సరీలలో పనికి వచ్చారు. అప్పుడే గడ్డుకాలం ప్రారంభమైంది. ఒడిశాకు చెందిన ఈ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. 
 
ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కడియం పూల నర్సరీల్లో ఘోరం జరిగింది. రోజూ మాదిరిగా నర్సరీ పనికి వెళ్లి వస్తున్న ఓ వివాహితపై నలుగురు యువకులు మరో నర్సరీలోకి లాక్కెళ్లి అత్యాచారం చేయడంతో పాటు చంపేసి, గోదావరి కాలువలో పడేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బుర్రిలంకలో హైవేను ఆనుకుని ఉన్న ఓ నర్సరీలో నాలుగేళ్ల నుంచి వివాహిత (43) పని చేస్తోంది. గత నెల 15న సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, మరో నర్సరీలో పనిచేసే నలుగురు యువకులు ఆమెను బలవంతంగా నర్సరీ లోపలికి ఈడ్చుకుపోయి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తరువాత పక్కనే ఉన్న గోదావరి కాలువలో పడేశారు. కంగారుపడిన భర్త కడియం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో 16న మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 17వ తేదీన చొప్పెల్ల లాకుల వద్ద కాలువలో ఆమె మృతదేహం తేలింది.
 
ఆమె ఒంటిపై కేవలం లంగా మాత్రమే ఉంది. తలమీద జుట్టుకూడా లేకుండా గుండు చేసినట్టు ఉంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి పోస్టుమార్టం చేయించారు.
 
అనంతరం ఆయా నర్సరీల యజమానులను, అక్కడ పనిచేసేవారందరినీ విచారించారు. పక్క నర్సరీలో పనిచేసే ఏసు అనే యువకుడు సంఘటన జరిగిన రోజు నుంచి పనికి రావడం మానేయడంతో అనుమానం వచ్చింది.. ఆరా తీస్తే నేరస్థుల గుట్టు రట్టయింది. 
 
దీంతో బుర్రిలంక గ్రామానికి చెందిన దేవర ఏసు (26), వెలుబుడి ప్రవీణ్ ‌(21), లోకిన జయప్రసాద్‌(19), పొట్టిలంకకు చెందిన దాసరి సురేష (21)ను 30వ తేదీన బుర్రిలంకలో అరెస్టు చేసి వివరాలు సేకరించారు. 
 
ఆమె కాళ్లూ చేతులు పట్టుకుని, నర్సరీ మొక్కల మధ్యకు తీసుకుని వెళ్లి నలుగురూ ఆమెపై అత్యాచారం చేసి, తర్వాత హత్య చేశారని రాజమహేంద్రవరం సౌత్‌ జోన్‌ డీఎస్పీ భవ్యకిశోర్‌ తెలిపారు. ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని కాలువలోకి విసిరేసినట్టు విచారణలో తేలిందన్నారు. 
 
నలుగురినీ అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచి 31న జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. సామూహిక అత్యాచారం, హత్య కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments