ఆస్తి ఇవ్వలేదని తల్లికి కర్మకాండలు చేయని నలుగురు కుమారులు

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (20:21 IST)
నేటికాలంలో చాలామంది మనుషులు ఆస్తిపాస్తులకు ఇచ్చే విలువ బంధాలకు, బంధుత్వాలకు ఇవ్వడం లేదు. ఈ సమాజంలో ఎవరూ లేని అనాధలుగా కొంతమంది మిగులుతుంటే ఇంకొంతమందైతే దిక్కుమొక్కులేనివారిగా చనిపోతున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఆస్తి కోసం కొడుకులు రెండురోజులుగా తల్లికి కర్మకాండలు చేయలేదు. 
 
రత్నమ్మకు నలుగురు కొడుకులు ఉన్నారు. అనారోగ్యంతో రత్నమ్మ భర్త నాగరాజు ఐదు సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఈమె పేరు మీద రెండు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. పొలం మొత్తం రత్నమ్మ పేరు మీద ఉంది. నామిని ఎవరినీ పెట్టలేదు. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడే నలుగురు కొడుకులు వచ్చి పొలాన్ని తమ పేర్ల మీద రాయాలని అడిగారు. 
 
అయితే ఇప్పుడు కాదు. తరువాత రాస్తానని రత్నమ్మ చెప్పింది. దీంతో కొడుకులు ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. రెండురోజుల క్రితం అనారోగ్యంతో రత్నమ్మ చనిపోయింది. విషయం కొడుకులకు తెలిసింది. కానీ ఆస్తి లేకపోవడంతో కర్మకాండలకు ఎవరూ ముందుకు రాలేదు. అనాధ శవంలా రెండురోజుల పాటు రత్నమ్మ మృతదేహాన్ని అలాగే ఉంచి ఆ తరువాత గ్రామస్తులే దహనం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments