Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మరో నలుగురు పోలీసులకు కరోనా!

Webdunia
శనివారం, 23 మే 2020 (22:23 IST)
తెలంగాణలో కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాజధానిలో మరో నలుగురు పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా తేలారు. 
 
ప్రస్తుతం వీరు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని కాచీగూడ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐ, వివిధ స్టేషన్లకు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎస్‌ఐ కుంటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. 
 
అయితే దీన్ని పోలీసు అధికారులు ధృవీకరించాల్సి ఉన్నది. ఎస్‌ఐకి కరోనా పాజిటివ్‌ రావడంతో కాచీగూడ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నవారందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
 
కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన దయాకర్‌ రెడ్డి అనే కానిస్టేబుల్‌ కరోనా వైరస్‌తో బుధవారం రాత్రి మరణించారు. దీంతో ఈ స్టేషన్‌లో పనిచేస్తున్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారికి నెగెటివ్‌ వచ్చింది.

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఈ రోజు మధ్యాహ్నం కుల్సుంపుర స్టేషన్‌ను సందర్శించారు. కరోనాతో మరణించిన దయాకర్‌ రెడ్డికి ఆయన నివాళులర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా, పర్యాటక రంగాలకు జీఎస్టీ స్లాబు ఊతం :కందుల దుర్గేష్

లిటిల్ హార్ట్స్ సక్సెస్ అవుతుందని ముందే చెప్పా : మౌళి తనుజ్

JD Chakravarthy: డబ్బుని మంచినీళ్లు లాగా ఖర్చు పెడుతున్నారు : జెడీ చక్రవర్తి

Nani: మోహన్ బాబు కీలక పాత్రలో నాని ది ప్యారడైజ్ చిత్రం

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments