Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో నలుగురు మైనర్లు మిస్సింగ్, అర్థరాత్రి నుంచి వెతుకుతున్న పోలీసులు

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:39 IST)
లాక్ డౌన్ దెబ్బకు ఇంట్లోనే మగ్గిపోతున్న పిల్లలు బయట కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆటపాటలతో చలాకీగా గడుపుతున్నారు. ఐతే ఇలా ఆడుకుని వస్తామని బయటకు వెళ్లిన నలుగురు టీనేజ్ పిల్లలు కనిపించకుండా పోయారు. ఒకేసారి నలుగురు కనిపించకపోవడంతో ఆందోళన చెలరేగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గుంటూరు సిటీలో వున్న నెహ్రూ నగర్‌లో గురువారం సాయంత్రం నలుగురు టీనేజ్ పిల్లలు ఆడుకుని వస్తామని చెప్పి వెళ్లారు. వారిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు. బాలికల వయసు 14, 15 కాగా అబ్బాయిల వయసు 13, 17. వీరిలో ముగ్గురు పిల్లది ఒకే కుటుంబం.
 
ఐతే ఆడుకుని వస్తారులే అని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు తమ బిడ్డలు ఇంటికి రాకపోయేసరికి వాళ్లు వెళ్లిన దగ్గర వెతికి చూసారు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సమీపంలోని వారి వద్ద వాకబు చేసినా ఆచూకి లభించకపోవడంతో వెంటనే గుంటూరు కొత్తపేట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న అర్థరాత్రి నుంచి గుంటూరులో ప్రధాన ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. కానీ ఇంతవరకూ వారి ఆచూకి లభించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments