Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్రపూజల కోసం బాలికను బలిచ్చేందుకు సిద్ధమైన నలుగురి అరెస్టు!

Webdunia
బుధవారం, 25 మే 2016 (15:49 IST)
గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తూ బాలికలను బలి ఇవ్వాలనుకున్న నలుగురిని రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... కడియం మండలం గుర్లంక గ్రామానికి చెందిన గణపతి అనే వ్యక్తి రాజమండ్రి నారాయణపురంలో ఎఫ్‌సీఐ గోదాముల వెనుక ఆరు నెలలుగా ఓ గదిని అద్దెకు తీసుకుని నివశిస్తున్నాడు. 
 
అతని వద్దకు వెంకన్నదొర (దేవీపట్నం), అమలాపురానికి చెందిన రామ్‌కుమార్, రంపచోడవరానికి చెందిన కాణెం పార్వతీదేవి, ఆమె కుమార్తె పావని (7) వచ్చారు. మంగళవారం అర్థరాత్రి వీరి గదిలో క్షుద్ర పూజలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. 
 
ఆసమయంలో బాలిక అపస్మారక స్థితిలో ఉండటం, క్షుద్ర పూజలకు సంబంధించిన సామగ్రితో, కత్తి, రెండు గడ్డపారలు కనిపించడంతో బాలికను బలిచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీంతో ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే క్షుద్రపూజకు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన సామానులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments