Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం - నలుగురి సజీవదహనం

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (11:34 IST)
విశాఖపట్టణం అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ లారస్ ల్యాబ్స్‌‍లో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడగా, అతని సమీపంలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. 
 
పరిశ్రమ అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మూడో యూనిట్‌లోని తయారీ విభాగం-6లో రియాక్టర్, డ్రయర్ల దగ్గర మధ్యాహ్నం 3.15 గంటలకు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రత రబ్బరుతో తయారు చేసిన ఉపకారణాలన్నీ కాలిపోయాయి. మంటలు తగ్గాగ సంఘటన స్థలాన్ని పరిశీలించగా, నలుగురు జీవన దహనమైన స్థితిలో ఒకరు తీవ్రంగా గాయలతో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. క్షతగాత్రుణ్ణి 4.20 గంటలకు విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పతికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. 
 
ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన బంగి రాంబాబు (32), గుంటూరుకు చెందిన తలశిల రాజేశ్ బాబు (36), అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడకుచెందిన రాపేటి రామకృష్ణ (28), చోడవరం మండలం బెన్నవోలుక చెందిన మజ్జి వెంకట రావు (36) ప్రాణాలు కోల్కోల్పోయారు. తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన యడ్ల సతీశ్ (36) మృత్యువుతో పోరాడుతూ ఆస్పత్రికి చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments