Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (09:33 IST)
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం లోని ఎర్రమంచి లో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై కారు గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు వైపు నుంచి హైదరాబాద్ వరకు వెళుతుంది. జాతీయ రహదారిపై ఉన్న వేగ నిరోధక వద్దా ముందర వెళ్తున్న గుర్తుతెలియని వాహనం నెమ్మదించడం తో వేగంగా వచ్చిన కారు గుర్తుతెలియని వాహనం ఢీకొంది.

ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ విట్టల్, అతనితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు మృతి చెందారు.మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మృతిచెందిన వారి వివరాలు.. 
రేఖ(21), కిషన్ గంజ్ నార్త్ దిల్లీ 
ఆంచల్ సింగ్(21)
మహబూబ్ఆలం(31)ఆర్.టీ.నగర్ నార్త్ బెంగళూరు
మనోజ్ మిట్టల్ (38)ప్లాటినం సిటీ నార్త్ బెంగళూరు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments