Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్ర‌హ్మంగారి మ‌ఠం స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం... న‌లుగురు మృతి!

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (20:35 IST)
కడప జిల్లా బద్వేలు, మైదుకూరు జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన నలుగురు మృతి చెందారు.
 
బ్రహ్మంగారి మఠం డి.అగ్రహారం సమీపంలో టమోటా లోడు లారీ వేగంగా, మారుతి ఎర్టిగా కారును ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్నఎనిమిది మందిలో నలుగురు మృతి చెందగా, ముగ్గరి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. మృతులు కర్ణాటక రాష్ట్రం మొగల్కోట్‌కు చెందిన వారిగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో సంవత్సరంలోపు చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. వీరంతా నెల్లూరు పట్టణంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా, ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు మృత దేహాల్లో ఓ మహిళ ఇద్దరు పురుషులు కాగా ఓ చిన్నారి కూడా ఉన్నారు. అర్ధ రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ శబ్దానికి గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామస్థుల సహాయంతో కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 ద్వారా తరలించారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేల్ ఆస్పత్రిలో ఉంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments