Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి మృతి

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (18:21 IST)
నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి సోమవారం కన్నుమూశారు. గత యేడాది కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన నెల్లూరులోని తన నివాసంలో చనిపోయారు. 
 
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంతో క్రియాశీలంగా ఉన్న శ్రీధర్ కృష్ణారెడ్డి గత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌పై 90 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
 
నెల్లూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడుగా, నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఈయన పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్‌పై 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 
 
2009లో ఆయనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరపున టిక్కెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ పోటీ చేసి ఓడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments