Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (08:49 IST)
వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో ఆయనను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దాడి కేసులో వల్లభనేని వంశీ ఓ నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయనను హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో అరెస్టు చేశారు. 
 
రాయదుర్గంలోని మై హోం భుజాలో ఉండగా గుర్తించి అరెస్టు చేసారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు తీసుకొస్తున్నట్టు సమాచారం. అయితే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారా లేదంటే మరో కేసులోనా అనేది తెలియాల్సివుంది. 
 
గన్నవరం టీడీపీ కార్యాలయంలో గత 2023 ఫిబ్రవరి 20వ తేదీన దాడి జరిగింది. ఈ కేసులో వంశీ సహా 88 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన విచారణ జరుగనుంది. అంతలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments