Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (08:49 IST)
వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో ఆయనను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దాడి కేసులో వల్లభనేని వంశీ ఓ నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయనను హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో అరెస్టు చేశారు. 
 
రాయదుర్గంలోని మై హోం భుజాలో ఉండగా గుర్తించి అరెస్టు చేసారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు తీసుకొస్తున్నట్టు సమాచారం. అయితే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారా లేదంటే మరో కేసులోనా అనేది తెలియాల్సివుంది. 
 
గన్నవరం టీడీపీ కార్యాలయంలో గత 2023 ఫిబ్రవరి 20వ తేదీన దాడి జరిగింది. ఈ కేసులో వంశీ సహా 88 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన విచారణ జరుగనుంది. అంతలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments