రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలి: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (19:15 IST)
byreddy rajasekhar reddy
ఏపీలో ఇటీవల చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.  ఏపీలోని జగన్ సర్కారును పనిలో పనిగా ఏకిపారేశారు. 
 
ప్రజల వద్దకే పాలన ఉండాలని నాటి సీఎం ఎన్టీఆర్ పరిపాలన సాగించారని… ఎమ్మార్వో అని ఎన్టీఆర్ పెడితే.. వైఎస్ఆర్ వచ్చి తహసీల్దార్ అని పేరు మార్చారన్నారు. ఎన్టీఆర్ ప్రజల వద్దకు పాలన తెస్తే.. జగన్ ప్రజలకు దూరంగా పాలన సాగిస్తున్నాడని బైరెడ్డి విమర్శించారు. జగన్ తుగ్లకా జగ్లకా అనేది తనకు అర్థం కావడం లేదన్నారు. 
 
అంతేగాకుండా.. రాయలసీమలోని నాలుగు జిల్లాలు చాలా పెద్దవిగా ఉంటాయని.. అందువల్ల రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల వైశాల్యం కంటే రాయలసీమ వైశాల్యం పెద్దగా ఉంటుందని బైరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు బైరెడ్డి తెలిపారు.
 
కడప, చిత్తూరు జిల్లాలను మూడు జిల్లాల చొప్పున ఆరు జిల్లాలుగా విభజించాలని కోరారు. ఆదోనీని జిల్లా చేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. అటు చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను కూడా జిల్లాగా చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments