Webdunia - Bharat's app for daily news and videos

Install App

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (17:26 IST)
విజయవాడ, గన్నవరంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో మాత్రం చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు కోర్టు మరోమారు రిమాండ్ పొడగించింది. 
 
అదేసమయంలో నకిలీ పట్టాల ఇళ్ల కేసులో విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో ఇదే కేసులో రెండు రోజుల పాటు వంశీని విచారించినందున మళ్లీ కస్టడీ అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఆ సమయంలో వంశీ అస్వస్థతకు గురికావడంతో విచారణ సరిగా జరగలేదని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపినప్పటికీ న్యాయమూర్తి అంగీకరించకుండా కస్టడీ పిటిషన్‌ను కొట్టివేశారు. 
 
మరోవైపు, ఇదే కేసులో వంశీకి విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో, పోలీసులు ఆయనకు వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇరు వర్గాల విచారణ అనంతరం వంశీకి జూన్ 12వ తేదీ వరకు రిమాండ్ పొడగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"హరిహర వీరమల్లు"కు పవన్ కళ్యాణ్ - జస్ట్ 4 గంటల్లో డబ్బింగ్ పూర్తి

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments