Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో కరోనా విలయం.. మరో ఎమ్మెల్యే మృతి

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (12:15 IST)
బీహార్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయంసృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడిన అనేక రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా మృత్యువాతపడుతున్నారు. తాజాగా జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరీ మహమ్మారితో పోరాడుతూ సోమవారం మృతి చెందారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
 
‘మేవాలాల్‌ గత వారం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో అప్పటి నుంచి పారాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారితో పోరాడుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు’ అని పార్టీ నేతలు తెలిపారు.
 
బీహార్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేవాలాల్‌ జేడీయూ తరపున తారాపూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జేడీయూ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక.. విద్యాశాఖ మంత్రిగా కేబినెట్‌లో ఆయనకు చోటు కల్పించారు. 
 
కానీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన నాలుగు రోజులకే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు, కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో బీహార్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదివారం రాత్రి కర్ఫ్యూ విధించింది. 
 
అంతేకాకుండా మే 15 వరకు విద్యాసంస్థలు అన్ని మూసివేసేందుకు నిర్ణయించింది. మరోవైపు సంక్షోభ సమయంలోనూ విధులు నిబద్దతతో నిర్వర్తిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఒకనెల బోనస్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments