Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి ఆళ్ల నానిపై చీటింగ్ కేసు.. కోర్టుకెక్కిన నాగమణి

సెల్వి
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (15:46 IST)
మాజీ మంత్రి ఆళ్ల నానిపై ఏలూరు త్రీ-టౌన్ పీఎస్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఇటీవలే పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయంలో నాగమణి అనే ఓ మహిళా నాయకురాలు గాయపడింది. వైద్య ఖర్చులు భరిస్తామని అప్పుడు హామీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత పట్టించుకోలేదని ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో నాని సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో గాయపడిన తనకు వైద్య ఖర్చుల భరిస్తానని ఆళ్ల నాని హామీ ఇచ్చారని, కానీ తర్వాత తమ గురించి పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీకి చెందిన నాగమణి అనే మహిళ ఆరోపించారు. 
 
బీమా వచ్చేలా చూస్తానని, తమ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి మోసం చేశారని ఆరోపిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఆళ్ల నాని, మరో ఏడుగురిపై ఏలూరు త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments