సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు తొలి అభ్యర్థన... ఏంటది?

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (18:04 IST)
ఓడలు బళ్లవుతాయి... బళ్లు ఓడలవుతాయి అని మన పెద్దలు చెప్పే సామెత తెలిసిందే. రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువ. ఐదేళ్ల క్రితం దర్పంతో వుండే ముఖ్యమంత్రులు తదుపరి ఎన్నికల్లో ఏమీ లేకుండా అయిపోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే తయారైంది. ఇప్పటికే పార్టీలో ఓడిన నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. మరికొందరేమో... పార్టీ బాధ్యతలు అప్పజెపుతుంటే... మాకొద్దు అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఇదీ అధికారం పోయిన తర్వాత పరిస్థితి. 
 
ఇక అసలు విషయానికి వస్తే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తొలిసారిగా ఓ అభ్యర్థన చేశారు. అదేమిటంటే.. తను ప్రస్తుతం వుంటున్న నివాసం పక్కనే వున్న ప్రజావేదికను తన అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలన్నది. ఎన్నికలకు ముందు తను ఏ గృహంలో అయితే వుంటున్నానో అదే ఇంట్లో తను వుండాలని నిర్ణయించుకున్నాననీ, దాని ప్రక్కనే వున్న ప్రజావేదిక ఖాళీగా వుండటంతో దాన్ని తన అధికారిక కార్యకలాపాలను జరుపుకునేందుకు ఇవ్వాలంటూ అభ్యర్థించారు. మాజీ సీఎం అభ్యర్థనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నారు. ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments