Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్‌పై హత్యాయత్నం కేసు : ఐపీఎస్ అధికారికి నోటీసులు (Video)

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (12:56 IST)
ఏపీ అసెంబ్లీ ఉపసభావతి రఘురామకృష్ణంరాజుపై హత్యాయత్నం కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్పట్లో ఏపీ సీఐడీ డీఐజీగా సునీల్ నాయక్ పనిచేశారు. దీంతో ఆయన వద్ద విచారించేందుకు వీలుగా రఘురామకృష్ణంరాజు కేసు దర్యాప్తు అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ రెండు రోజుల క్రితం నోటీసులు పంపించారు. 
 
రఘురామరాజును హైదరాబాద్ నగరంలో అరెస్టు చేసి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినపుడు సునీల్ నాయక్ కూడా వచ్చినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో ఆయన పాత్రపైనా విచారించాలని నిర్ణయించిన అధికారులు ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. 
 
బీహార్ క్యాడర్‌‍కు చెందిన సునీల్ నాయక్... వైకాపా ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి సీఐడీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే సునీల్ నాయక్ తిరిగి బీహార్ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆ రాష్ట్ర అగ్నిమాపకశాఖలో డీఐజీగా పని చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే రెండూ ఒకే రోజు జరిగాయనేది శివంగి గ్రిప్పింప్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments