నివర్ తుఫాన్‌లో మరణించిన వారికి రూ. 5 లక్షలు: ఉపముఖ్యమంత్రి బాషా

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (17:38 IST)
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో వరదపై సమీక్షా సమావేశం నిర్వహించిన తరువాత బయటకు వచ్చిన ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మీడియాతో మాట్లాడారు. మానవతా దృక్ఫథంతో అధికారులు పనిచేయాలని.. ఏ రైతు నష్టపోకూడదని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక రూపంలో డిసెంబర్ 15వ తేదీ లోగా ఇవ్వాలని సిఎం అధికారులను ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. 
 
అలాగే నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతి చెందారని, మృతి చెందినవారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. వెంటనే బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాకుండా కడప జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయిన బుగ్గవంకను 39 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేసేందుకు సిఎం ఆమోదించారని, అలాగే పింఛా నది, అన్నమాచార్య ప్రాజెక్టుల ఎత్తును కూడా పెంచుతున్నట్లు చెప్పారు.
 
వరదలతో కొట్టుకుపోయిన రోడ్లను త్వరలో పునరుద్ధరిస్తామని, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో లక్షల హెక్టార్లలో పంట నష్టపోయిన మాట వాస్తవమేనన్నారు. డిసెంబర్ 15వ తేదీ లోపు పంట నష్టంపై నివేదికలను పరిశీలించిన తరువాత డిసెంబర్ 30లోగా బాధితులకు నష్టపరిహారాన్ని అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments