Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#farmersprotest ఢిల్లీలో యువ రైతు ఆ పని చేశాడు.. వీడియో వైరల్

#farmersprotest ఢిల్లీలో యువ రైతు ఆ పని చేశాడు.. వీడియో వైరల్
, శనివారం, 28 నవంబరు 2020 (13:14 IST)
#farmersprotest
ఢిల్లీలో రైతులు ఆందోళనకు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజులుగా వీళ్లు దేశ రాజధానిలో ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరిని ఢిల్లీలోకి రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు వీరిపైకి టియర్ గ్యాస్‌, వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. అయితే ఈ వాటర్ కెనాన్‌ల నుంచి రైతులను రక్షించడానికి ఓ యువ రైతు ఏకంగా వాటర్ కెనాన్ వాహనంపైకి ఎక్కి దానిని బంద్ చేశాడు. 
 
అలా చేసినందుకు ఇప్పుడు పోలీసులు ఏకంగా అతనిపై హత్యాయత్నం కేసును నమోదు చేయడం గమనార్హం. సోషల్ మీడియా మొత్తం అతన్ని ఓ హీరోగా చూస్తుంటే.. పోలీసులు మాత్రం ఇంత కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంటుంది. పంజాబ్‌కు చెందిన ఆ 26 ఏళ్ల నవ్‌దీప్ సింగ్ అనే రైతు పోలీసుల తీరుపై మండిపడుతున్నాడు. ఇతడు ఓ రైతుల సంఘం అధ్యక్షుడైన జై సింగ్ కుమారుడు. తాను చదువు పూర్తి చేసిన తర్వాత తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నానని, ఇప్పటి వరకు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని నవ్‌దీప్ సింగ్ అంటున్నాడు.
 
ఆ జల ఫిరంగులు రైతులను గాయపరుస్తున్నాయన్న ఉద్దేశంతోనే తాను వాటిని ఆఫ్ చేసినట్లు చెప్పాడు. అయితే మొదటి నుంచీ రైతుల పట్ల హర్యానా, ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని వారిపై ఆరోపణలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలి వ్యాక్సిన్‌ను తెలంగాణకు ఇవ్వాలి.. ఈటెల డిమాండ్