Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికటించిన వివాహ పాయసం... 500 మందికి అస్వస్థత

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (11:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో ఓ వివాహ విందులో వడ్డించిన పాయసం వికటించింది. దీంతో 500 మంది వరకు ఆహుతులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా ప్రస్తుతం సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
నిర్మల్ జిల్లా భైంసాలో ఓ వివాహ వేడుక పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాలులో జరిగింది. ఈ వివాహ వేడుకలో భాగంగా, విందు భోజనంతో పాటు వడ్డించిన పాయసం వికటించింది. విందులో వడ్డించిన పాయసం ఆరగించిన తర్వాత వారందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో దాదాపు 500 మంది వరకు అస్వస్థతకు లోనయ్యారు. 
 
బాధితులను చికిత్స నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తొలుత పదుల సంఖ్యలోనే అస్వస్థతకు గురైనప్పటికీ.. క్రమంగా వారి సంఖ్య వందల సంఖ్యకు చేరుకోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వైద్య సిబ్బంది బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం గమనార్హం. వీరంతా మొదటి, రెండు బంతుల్లో వడ్డించిన పాయసం ఆరగించారు.

సంబంధిత వార్తలు

తండ్రీ కొడుకు మధ్య సాగే కథతో భజే వాయు వేగం టీజర్ : మెగాస్టార్ చిరంజీవి

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ పెద్ద విజయాన్ని సాధించాలి : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

పదిమందికి పని కల్పించడంలో చాలా ఆనందం వుంది: నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల

ఆసక్తికి రేకెత్తిస్తున్న వరుణ్ సందేశ్ - నింద పోస్టర్

గుడిని మూసేయండి అంటున్న సీతా కళ్యాణ వైభోగమే టీజర్‌- మంత్రి కోమటి రెడ్డి ఆవిష్కరణ

టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

తర్వాతి కథనం
Show comments