Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికటించిన వివాహ పాయసం... 500 మందికి అస్వస్థత

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (11:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో ఓ వివాహ విందులో వడ్డించిన పాయసం వికటించింది. దీంతో 500 మంది వరకు ఆహుతులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా ప్రస్తుతం సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
నిర్మల్ జిల్లా భైంసాలో ఓ వివాహ వేడుక పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాలులో జరిగింది. ఈ వివాహ వేడుకలో భాగంగా, విందు భోజనంతో పాటు వడ్డించిన పాయసం వికటించింది. విందులో వడ్డించిన పాయసం ఆరగించిన తర్వాత వారందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో దాదాపు 500 మంది వరకు అస్వస్థతకు లోనయ్యారు. 
 
బాధితులను చికిత్స నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తొలుత పదుల సంఖ్యలోనే అస్వస్థతకు గురైనప్పటికీ.. క్రమంగా వారి సంఖ్య వందల సంఖ్యకు చేరుకోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వైద్య సిబ్బంది బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం గమనార్హం. వీరంతా మొదటి, రెండు బంతుల్లో వడ్డించిన పాయసం ఆరగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments