Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి వైసీపీ నేతల మధ్య చిచ్చు..ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:54 IST)
రాజమండ్రి లో అధికార వైసీపీ నాయకుల మధ్య చిచ్చు రేగింది. ఆదిపత్య పోరు తారా స్థాయికి చేరింది. అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

సీఎం జగన్ రాజమండ్రి పర్యటనలోనూ ఈ లుకలుకలు తీవ్ర స్థాయిలో బయటపడ్డాయి. అధికార పార్టీకి చెందిన పార్లమెంటు నాయకుడు తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఆయా ప్రాంతాల్లో కనీసం స్థానిక నాయకులకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని పార్టీలో పలువురు కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు.
 
దిశ పోలీసు స్టేషన్ ప్రారంభానికి విచ్చేసిన సీఎం జగన్‌కి స్వాగతం పలుకుతూ రాజమండ్రిలో జాతీయ రహదారిపై వైసీపీ పార్లమెంటు నాయకుడు భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

అయితే ఈ ప్లెక్సీలలో యాప్ ఆవిష్కరణ జరుగుతున్న నియోజకవర్గ స్థానిక ప్రజా ప్రతినిధి ఫోటోలను ఉద్దేశపూర్వకంగానే ఆ నాయకుడు ఏర్పాటు చేయలేదంటూ పార్టీలో కార్యకర్తల మధ్య లుకలుకలు ఏర్పడ్డాయి. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
 
శనివారం సీఎం పర్యటనలోనూ ఆధిపత్య పోరు కొనసాగుతూ పార్టీలో చేరికల విషయంలో.. పలువురు విభేదించిన వారికి పార్టీ కండువాలు వేయించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల కాలంలో రాజమండ్రి పార్లమెంటరీలోని ఆయా నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఆ నాయకుడే చేపడుతున్నారని.. స్థానిక నేతలకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని శ్రేణుల్లో అసంతృప్తితో రగిలిపోతోంది.
 
టీడీపీ కంచుకోటగా ఉన్న రాజమహేంద్రవరంలో వైసీపీ పాగా వేసుందుకు ప్రయత్నించి గత సాధారణ ఎన్నికల్లో బెడిసికొట్టింది.

ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో రాజమండ్రిపై పట్టు సాధించే అవకాశం ఉన్నా.. పార్టీలో అంతర్గత విభేదాలతో మరింత నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments