Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలం ఫారెస్ట్ బీట్‌లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (11:19 IST)
తిరుమల తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతంలోని ఫారెస్ట్ బీట్‌లో అగ్నిప్రమాదం చెలరేగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గత మూడు, నాలుగు రోజులుగా కార్చిచ్చు కల్లోలం రేపుతోంది. అనంతపురంలో అటవీ సంపద దహనం కొనసాగుతోంది. వేలాది ఎకరాల్లో వృక్షాలు, వందల సంఖ్యలో వన్యప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. 
 
ఇదిలావుంటే, శేషాచలం అటవీ ప్రాంతంలో కూడా మంటలు చెలరేగాయి. ఎర్రచందనం స్మగ్లర్ల వల్లే ఈ మంటలు చెలరేగివుంటాయని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలోని కరకంబాడి ఫారెస్ట్ బీట్‌లో ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు వెల్లడించారు. ఆ వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలను అదుపు చేశాయి. 
 
అయితే, శేషాచలం అడవుల్లో తరచుగా చెలరేగుతున్న కార్చిచ్చుతో అరుదైన వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా అపారనష్టం వాటిల్లుతుంది. తరచుగా అగ్నిప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments