Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలం ఫారెస్ట్ బీట్‌లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (11:19 IST)
తిరుమల తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతంలోని ఫారెస్ట్ బీట్‌లో అగ్నిప్రమాదం చెలరేగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గత మూడు, నాలుగు రోజులుగా కార్చిచ్చు కల్లోలం రేపుతోంది. అనంతపురంలో అటవీ సంపద దహనం కొనసాగుతోంది. వేలాది ఎకరాల్లో వృక్షాలు, వందల సంఖ్యలో వన్యప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. 
 
ఇదిలావుంటే, శేషాచలం అటవీ ప్రాంతంలో కూడా మంటలు చెలరేగాయి. ఎర్రచందనం స్మగ్లర్ల వల్లే ఈ మంటలు చెలరేగివుంటాయని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలోని కరకంబాడి ఫారెస్ట్ బీట్‌లో ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు వెల్లడించారు. ఆ వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలను అదుపు చేశాయి. 
 
అయితే, శేషాచలం అడవుల్లో తరచుగా చెలరేగుతున్న కార్చిచ్చుతో అరుదైన వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా అపారనష్టం వాటిల్లుతుంది. తరచుగా అగ్నిప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments