Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోషా మహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (09:37 IST)
గోషా మహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 
 
ఈ ప్రమాదంలో స్టేడియంలో పలు కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.  పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన వాహనాలను పలు పోలీస్ స్టేషన్ల నుండి గోషామహల్ స్టేడియంలో భద్రపరుస్తారు. ఈ ప్రమాదంలోఆయా వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. కాలిపోయిన వాహనాలన్నీ ప్రస్తుతం స్క్రాప్ గా మారాయని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించింది ఆరా తీస్తున్నారు

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments