Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచలం మృతురాలి కుటుంబానికి రూ.9 లక్షల పరిహారం

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (12:35 IST)
విశాఖ జిల్లా సింహగిరి మెట్లమార్గంలో బండరాళ్లు దొర్లిపడి మహిళ మృతి చెందడంతో సింహాచలం దేవస్థానం అధికారులు నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారు. సింహగిరి మెట్లమార్గంలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ఆకాశధార దగ్గర నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకూ ప్రమాదకరంగా ఉన్న రాళ్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. మెట్లను ఆనుకుని ఉన్న రాళ్లను ముందుగా తొలగించనున్నారు. భవిష్యత్తులో పనుల జరిగేటప్పుడు రాళ్లు జారిపడకుండా ఇనుప‌ మెస్‌ ఏర్పాటుచేయాలని డిసైడయ్యారు.
 
ప్రస్తుతానికి భక్తులు మెట్లమార్గంలోకి రాకుండా సింహగిరిపైన, కొండ దిగువన తొలిపావంచా దగ్గర దారులను మూసివేశారు. సెక్యూరిటీ గార్డులను అక్కడ నియమించారు.
 
మెట్లమార్గంలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఆదిరెడ్డి భవానీ కుటుంబానికి దేవస్థానం తరపున రూ.5 లక్షలు, పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి రూ.3 లక్షలు, ఇంజినీరింగ్‌ అధికారులు రూ.లక్ష మొత్తం 9 లక్షలు తక్షణ సాయంగా అందిస్తామని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments