Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచలం మృతురాలి కుటుంబానికి రూ.9 లక్షల పరిహారం

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (12:35 IST)
విశాఖ జిల్లా సింహగిరి మెట్లమార్గంలో బండరాళ్లు దొర్లిపడి మహిళ మృతి చెందడంతో సింహాచలం దేవస్థానం అధికారులు నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారు. సింహగిరి మెట్లమార్గంలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ఆకాశధార దగ్గర నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకూ ప్రమాదకరంగా ఉన్న రాళ్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. మెట్లను ఆనుకుని ఉన్న రాళ్లను ముందుగా తొలగించనున్నారు. భవిష్యత్తులో పనుల జరిగేటప్పుడు రాళ్లు జారిపడకుండా ఇనుప‌ మెస్‌ ఏర్పాటుచేయాలని డిసైడయ్యారు.
 
ప్రస్తుతానికి భక్తులు మెట్లమార్గంలోకి రాకుండా సింహగిరిపైన, కొండ దిగువన తొలిపావంచా దగ్గర దారులను మూసివేశారు. సెక్యూరిటీ గార్డులను అక్కడ నియమించారు.
 
మెట్లమార్గంలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఆదిరెడ్డి భవానీ కుటుంబానికి దేవస్థానం తరపున రూ.5 లక్షలు, పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి రూ.3 లక్షలు, ఇంజినీరింగ్‌ అధికారులు రూ.లక్ష మొత్తం 9 లక్షలు తక్షణ సాయంగా అందిస్తామని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments