గుంటూరులో వైకాపా వర్సెస్ టీడీపీ కొట్లాట - 17 మందికి గాయాలు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (11:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణాత్మక వైఖరి పెరిగిపోతోంది. ఫలితంగా ఇరు పార్టీల మధ్య కక్షలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య నిత్యం ఏదో ప్రాంతంలో గొడవులు జరుగుతూనే ఉన్నాయి. 
 
తాజాగా గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో వైకాపా, టీడీపీ కార్యకర్తలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాల వారిలో కొందరు గాయపడ్డారు. ఇటీవలే కారుమంచిలో తిరునాళ్లు జరిగాయి. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. తాజాగా ఆ వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. 
 
ఈ ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాల వారిని అదుపు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కొట్లాటలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments