Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో దారుణం.. పురుగుల మందు పోసి బాలికపై అత్యాచారం..

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (16:34 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ళ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను చంపేందుకు బలవంతంగా నోట్లో పురుగుల మందు పోశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 
 
దేవనకొండ మండలం ప్యాలకుర్తి గ్రామంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. స్కూల్ సెలవులు కావడంతో బాలిక ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో పొలం పనుల కోసం తల్లిదండ్రులు పోయారు. ఒంటరిగా ఉన్న ఆమె ఇంట్లోకి చొరబడిన ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. పక్కింటి బాలుడు ఈ దారుణాన్ని చూసి కేకలు వేయడంతో పరారయ్యారు. అంతకు ముందే ఆమెను బలవంతంగా పురుగుల మందు తాగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం