Webdunia - Bharat's app for daily news and videos

Install App

4న రైతుసంఘం చలో అసెంబ్లీ

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (07:42 IST)
తడిసిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని, విద్యుత్‌ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యాన 4న చలో అసెంబ్లీ చేపట్టనున్నట్లు సంఘం రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ ప్రకటన విడుదల చేశారు. నివర్‌ తుపాను వల్ల పంట కళ్లాలలోని, మార్కెట్‌యార్డులో ఉన్న ధాన్యం రాశులు నీట మునిగాయని తెలిపారు. కోతకు సిద్ధమై ఉన్న వరి పొలాలన్నీ నీట మునిగాయని పేర్కొన్నారు. రైతుకు అపార నష్టం కలిగిందని తెలిపారు.

ఇదే అదనుగా వరికోత యంత్రాల అద్దె గంటకు రూ.2 వేలు నుండి రూ.3వేలకు పెంచారని రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.

తడిసిన ధాన్యాన్ని నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలని, ఈక్రాప్‌ బుకింగ్‌తో సంబంధం లేకుండా ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, బకాయి ఉన్నా.. నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని, నష్టపరిహారం వరికి ఎకరాకు రూ.25వేలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు రూ.50వేలు ఇవ్వాలని, జిఒ 22 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రైతులు తమ తడిసిన ధాన్యం, నీటి మునిగిన వరి పనలతో ఉండవల్లి సెంటరుకు 4న ఉదయం 10 గంటలకు రావాలని, అక్కడి నుండి చలో అసెంబ్లీ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments