Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల బాధ తాళలేక మరో రైతు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (19:28 IST)
కర్నూలు జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు గొల్ల నాగన్న(46) అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన మేరకు గొల్ల నాగన్న తనకున్న 9ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు సాగుచేశాడు. 
 
బోరుబావిలో నీరు తగ్గిపోవడంతో పంటలు ఎండిపోయి ప్రతిఏటా దిగుబడి తగ్గి నష్టాలపాలయ్యాడు. వ్యవసాయం కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద, బ్యాంకుల్లో సుమారు రూ.12 లక్షల దాకా అ ప్పులు చేశాడు. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోయానని తరచూ భార్య రామక్కతో ఆవేదన చెందేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా ఆవేదనతోనే భోజనం చేశాడు. 
 
అనంతరం బయటకు వెళ్లి వస్తా అని చెప్పి వెళ్లాడు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో ఓ చెట్టుకు పంచెతో వేసిన ఉరికి వేలాడుతున్న నాగన్నను అటుగా వెళ్తున్న గ్రామస్థులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. ఇతడికి భార్య, ముగ్గు రు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. రూరల్‌ ఎస్‌ఐ సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments