నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (14:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేసిన కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్‌కు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో ఆయనతో సహా మరో మరో ఆరుగురు నిందితులు కూడా ఉన్నారు. వీరందరికీ కోర్టు రిమాండ్ పొడగించింది. ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, సన్నిహితుడు అద్దేపల్లి జనార్ధన్ రావుతో పాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. 
 
వీరందరికీ గతంలో విధించిన రిమాండ్ మంగళవారంతో ముగిసింది. దీంతో వీరిని మంగళవారం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరచగా, వీరికి రిమాండ్‍ను డిసెంబరు 9వ తేదీ వరకు పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, ఏపీలో ఈ నకిలీ మద్యం తయారీ కేసు సంచనలనంగా మారిన విషయం తెల్సిందే. గత వైకాపా ప్రభుత్వంలో చిన్నపాటి కుటీరపరిశ్రమగా ప్రారంభమైంది. అనతికాలంలోనే భారీ మొత్తంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ కోట్లాది రూపాయలను అక్రమంగా అర్జించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఈ నకిలీ మద్యం తయారీ కేసు వెలుగు చూడటంతో పలువురుని ఏపీ ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments