Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ఎంపీ రాయపాటికి సి.బి.ఐ అధికారులమంటూ బురిడీ

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (17:40 IST)
సి.బి.ఐ అధికారుల పేరు చెప్పి, మాజీ ఎంపీ రాయపాటికి బురిడీ కొట్టే ప్రయత్నం చేశారో ఇద్దరు ఆగంతకులు. సి.బి.ఐ కేసుల నుంచి తప్పిస్తామని, కేసులను మాఫీ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని రాయపాటికి ఫోనులో డిమాండ్ చేశారు. 
 
ఢిల్లీ సి.బి.ఐ కార్యాలయం నుంచి ఫోను చేస్తున్నామని కేసుల నుంచి బయటపడేందుకు తాము పూర్తి స్థాయిలో సహాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ ఫోను కాల్ వ్యవహారంపై ఢిల్లీ సి.బి.ఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు రాయపాటి సాంబశివరావు.
 
దీంతో రంగంలోకి దిగిన సి.బి.ఐ అధికారులు రెండురోజులు నిఘా పెట్టి హైదరాబాద్ చెందిన మణివర్ధన్ రెడ్డితో పాటుగా చెన్నైకి చెందిన సెల్వంను  అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్ చెన్నైలలో వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇరువురు దగ్గర నుంచి సెల్ ఫోనుల  స్వాధీనం చేసుకున్నారు. 
 
కొందరు ప్రముఖులను  బెదిరింపులకు పాల్పడిన కొన్ని వాట్సాప్ మెసేజ్‌లను కూడా సిబిఐ అధికారులు గుర్తించారు. గత డిసెంబరులో రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ రూ.300 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా సిబిఐ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments