మాజీ ఎంపీ రాయపాటికి సి.బి.ఐ అధికారులమంటూ బురిడీ

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (17:40 IST)
సి.బి.ఐ అధికారుల పేరు చెప్పి, మాజీ ఎంపీ రాయపాటికి బురిడీ కొట్టే ప్రయత్నం చేశారో ఇద్దరు ఆగంతకులు. సి.బి.ఐ కేసుల నుంచి తప్పిస్తామని, కేసులను మాఫీ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని రాయపాటికి ఫోనులో డిమాండ్ చేశారు. 
 
ఢిల్లీ సి.బి.ఐ కార్యాలయం నుంచి ఫోను చేస్తున్నామని కేసుల నుంచి బయటపడేందుకు తాము పూర్తి స్థాయిలో సహాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ ఫోను కాల్ వ్యవహారంపై ఢిల్లీ సి.బి.ఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు రాయపాటి సాంబశివరావు.
 
దీంతో రంగంలోకి దిగిన సి.బి.ఐ అధికారులు రెండురోజులు నిఘా పెట్టి హైదరాబాద్ చెందిన మణివర్ధన్ రెడ్డితో పాటుగా చెన్నైకి చెందిన సెల్వంను  అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్ చెన్నైలలో వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇరువురు దగ్గర నుంచి సెల్ ఫోనుల  స్వాధీనం చేసుకున్నారు. 
 
కొందరు ప్రముఖులను  బెదిరింపులకు పాల్పడిన కొన్ని వాట్సాప్ మెసేజ్‌లను కూడా సిబిఐ అధికారులు గుర్తించారు. గత డిసెంబరులో రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ రూ.300 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా సిబిఐ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments