Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 మంది యువతులు, మహిళలతో కామవాంఛ తీర్చుకున్న దొంగబాబా, ఎక్కడ?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (16:53 IST)
అసలే కరోనా కాలం. ఆరోగ్యంగా ఉండాలని, ఉద్యోగాలు రావాలలని, కుటుంబ సమస్యలు తొలగిపోవాలని ఇలా జనం భావిస్తున్నారు. దీంతో కొంతమంది బాబాలను ఆశ్రయిస్తున్నారు. అయితే దీన్నే ఆసరాగా చేసుకున్న కొంతమంది దొంగబాబాలు ఏకంగా మహిళలు, యువతలతో కామవాంఛ తీర్చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.
 
శ్రీకాళహస్తి పట్టణం పూసలవీధికి చెందిన ఒక వ్యక్తి బాబా అవతారమెత్తాడు. తన మంత్రశక్తులతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని, కరోనా రాకుండా చేస్తానని.. ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అలా అలా అందరికీ తెలిసింది. అసలు విషయం తెలియని కొంతమంది దొంగబాబాను ఆశ్రయించారు.
 
అమ్మాయిలు, మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారికి మత్తు మందు కలిపి ఇచ్చి నగ్నంగా ఫోటోలు తీసి వాటిని చూపించి లోబరుచుకునేవాడు. ఇలా 30 మంది మహిళలు, యువతుల జీవితాలతో చెలగాటమాడుకున్నాడు. నిన్న ఇదేవిధంగా ఒక కుటుంబం వెళ్ళింది. ఇద్దరు యువతులను మభ్యపెట్టాడు. 
 
దీంతో ఆ యువతులు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు పోలీసులకు ఆశ్రయించారు. విషయం బయటకు రానివ్వకుండా ఆ దొంగబాబా ఓ రాజకీయ పార్టీ నేతను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments