Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండ్లపాడును వెంటాడుతున్న ఫ్యాక్షన్ భూతం.. ఆ గ్రామంలో 18 హత్యలు

సెల్వి
సోమవారం, 2 జూన్ 2025 (12:51 IST)
గుండ్లపాడును ఫ్యాక్షన్ భూతం వెంటాడుతుంది. ఇప్పటికే ఆ గ్రామంలో 18 హత్యలు జరిగాయి. కానీ ఒక్క కేసుకు మాత్రమే శిక్షపడింది. మాచర్ల నియోజకవర్గంలోనే అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఇప్పటికీ ఫ్యాక్షనిజం పేట్రేగుతున్న గ్రామం వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు. ఇటీవలి జంట హత్యలతో అది మరోసారి నిరూపితమైంది. 
 
ఈ హత్యాకాండల్లో ఎక్కువగా నష్టపోయింది టీడీపీ వారే. 1987లో జడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత జరిగిన ఓ ఘటనతో ఘర్షణలు ప్రారంభమయ్యాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. 
 
1989 నుంచి గుండ్లపాడులో ప్రశాంతత కరువైంది. ఈ నేపథ్యంలో 1990లో రెండు గ్రూపుల మధ్య గొడవల్లో మూడు హత్యలు చోటుచేసుకున్నాయి. కేసులు నమోదు చేసిన పోలీసులు 9 మందిని రిమాండ్‌కు పంపారు. 2014లో తెలుగుదేశం పార్టీకి చెందిన తోట వెంకట నరసయ్యను వైఎస్సార్సీపీకి చెందిన తొమ్మిది మంది పొలంలో కత్తులతో నరికి దారుణంగా హతమార్చారు. 
 
2022లో తోట చంద్రయ్యపై వైఎస్సార్సీపీకి చెందిన చింత శివరామయ్య, మరో ఏడుగురు కత్తులతో దాడి చేసి అందరూ చూస్తుండగానే హతమార్చారు. ఇటీవల గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులను ప్రత్యర్థులు చంపేశారు. ఇలా గుండ్లపాడులో రక్తపాతం కొనసాగుతూనే ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments