Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి కానుకంగా లగ్జరీ ఎలక్ట్రిక్ స్కూటర్ల గిఫ్ట్

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (10:27 IST)
తిరుమల శ్రీవారికి ప్రముఖ ద్విచక్రవాహన తయారీ కంపెనీ టీవీఎస్ లగ్జరీ బైకును బహుమతిగా ప్రధానం చేసింది. ఈ వాహనాలను ఆ సంస్థ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ తితిదే అధికారులకు అందజేశారు. ఎన్డీఎస్ ఎకో సంస్థ కూడా ఓ ద్విచక్రవాహనాన్ని అందించింది. ఈ సందర్భంగా బైకు దాతలను తితిదే ఏవీవో వెంకయ్య చౌదరి అభినందించారు. 
 
సాధారణంగా శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు తీర్చుకుంటారు. తమ శక్తి మేరకు కానుకలు సమర్పిస్తుంటారు. వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ సెలెబ్రిటీలు భారీగా విరాళాలు ఇస్తుంటారు భక్తులు స్వామివారికి ఎక్కువగా నగదు, నగలు కానుకలుగా ఇస్తుంటారు. తాజాగా శ్రీవారికి ఖరీదైన లగ్జరీ బైకులను అందజేశారు. 
 
చెన్నైకు చెందిన టీవీసీ, బెంగుళూరు నగరానికి చెందిన ఎన్డీఎస్ ఎకో సంస్థలు ఈ ఎకో ద్విచక్రవాహనలను ఆయా సంస్థల అధినేతలు కానుకగా అందజేశారు. టీవీఎస్ అందించిన ఐక్యూబ్ ఎక్స్ వాహనం ధర రూ.2.70 లక్షలు కాగా, ఎన్డీఎస్ ఎకో అందించిన వాహనం ధర రూ.1.56 లక్షలని ఆయా సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఆలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బైక్ తాళాలను ఏఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సంర్భంగా వారిని ఏఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ సంస్థ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎండీ సుదర్శన్, తిరుమల డీఐ సుబ్రహ్మణ్యం, ఎన్డీఎస్ ఎకో సంస్థ చైర్మన్ ఎంహెచ్ రెడ్డి తదితరులు ఉన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments