బీజేపీలో చేరిన వైకాపా మాజీ నేత దారుణ హత్య...

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (15:11 IST)
కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన నేత దారుణ హత్యకు గురయ్యాడు. పార్టీ వీడటాన్ని జీర్ణించుకోలేని వైకాపా నేతలే ఈ దారుణానికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఆదోని మండలం, పెద్దహరివాణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన శేఖన్న (50) గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో వైకాపా తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఆ ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోవడంతో ఆయన వైకాపాను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. దీన్ని స్థానిక వైకాపా నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్నను గుర్తు తెలియని దుండగులు గొంతకోసి హత్య చేశారు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే శేఖన్నకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments