Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊళ్లో అందరూ మంచోళ్లే.. పోలీసులు రాకూడదంటే ఎలా?: ఉండవల్లి

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (12:59 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి రాష్ట్రంలో అనుమతిని ఉపసంహరిస్తూ.. ఏపీ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను ఉండవల్లి తప్పుబట్టారు. సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ సంస్థలంటేనే సీఎం వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. 
 
అంతేగాకుండా.. రాష్ట్ర భూభాగ పరిధిలో సీబీఐ విచారణ చేసేందుకు అనుమతి లేదంటూ దేశంలోనే తొలిసారిగా జీవో జారీ చేసిన సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. తమపై విచారణ జరుగకూడదనే విధంగా సీఎం జీవో జారీ చేశారని తప్పుబట్టారు. 
 
ఊళ్లో అందరూ మంచోళ్లేనని.. పోలీసులు ఊర్లోకి రావాల్సిన అవసరం లేదంటే ఎలా అంటూ ఉండవల్లి ప్రశ్నించారు. వ్యాపారాలు చేసే టీడీపీ నాయకులు.. ప్రజా ప్రతినిధులపై ఐటీ దాడులు జరిగితే తనపై దాడి చేసినట్లుగా సీఎం ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. చంద్రబాబు తన వెనుకున్న కోటీశ్వరుల తరపున వున్నారా.. ప్రజల పక్షంలో వున్నారా అని అడిగారు.
 
తప్పు చేయని పక్షంలో దర్యాప్తు సంస్థలను పంపితే మిగులుతారా.. ప్రధాని ఏం చేయకుండానే ఎందుకు కంగారు పడుతున్నారని.. మోదీ అనుకుంటే తన పరిధిలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు ఆదేశించవచ్చని అరుణ్ కుమార్ తెలిపారు. చంద్రబాబు రాజకీయ సమర్థతపై పూర్తి నమ్మకం వుందని.. దేశంలోని అన్నీ పార్టీలతో కలిసిన వారు చంద్రబాబు ఒక్కరేనని ఉండవల్లి చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments