వైకాపాలోకి కాటసాని రాంభూపాల్ రెడ్డి.. కండువా కప్పిన జగన్

వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు క్రమంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతలు పార్టీల్లో చేరడం, పార్టీ నుంచి విడిపోవడం వంటివి వరుసగా జరుగుతున్నాయి.

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (13:03 IST)
వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు క్రమంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతలు పార్టీల్లో చేరడం, పార్టీ నుంచి విడిపోవడం వంటివి వరుసగా జరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను కనుమూరు సమీపంలో కాటసాని కలుసుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన వైఎస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
 
పార్టీలో చేరికపై మాట్లాడిన కాటసాని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో పాణ్యం నియోజవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. నేడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలసి నడవడం తన అదృష్టమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర  కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని కాటసాని ఈ సందర్భంగా ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments