Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మాజీమంత్రి పొన్నాల బంధువు మృతి

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:51 IST)
తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడు కోడూరి ధృపత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. 
 
వివరాల్లోకి వెళ్తే 22 ఏళ్ల కోడూరి ధృపత్ తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. 
 
దీంతో డివైడర్ తలకు బలంగా ఢీ కొట్టడంతో ధృపత్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ధృపత్ ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 
 
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments