Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా రాసిన లేఖ బాహుబలిలో కాలకేయుడు రాసినంత నీచంగా వుంది

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా తక్కువని టీడీపీ నేత డొక్కా మాణిక్యప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరాచకాలను ప్రశ్నించేవారిపై కేసులు

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (13:46 IST)
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా తక్కువని టీడీపీ నేత డొక్కా మాణిక్యప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరాచకాలను ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్రం ఎదురుదాడి చేస్తుందని దుయ్యబట్టారు. ఇందులో భాగమే బీజేపీ జాతీయాధ్యక్షుడి లేఖ అని డొక్కా మండిపడ్డారు. 
 
బాహుబలి సినిమాలో కాలకేయుడు రాసినంత నీచంగా అమిత్ షా లేఖ ఉందని విమర్శించారు. అమిత్ షా లేఖలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని డొక్కా గుర్తు చేశారు. ఏపీలోని ఐదు కోట్ల ప్రజల కోసం పోరాటం జరుగుతుంటే.. ప్రధాని మోదీకి వైసీపీ నేతలు సలాం కొడుతూ.. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని తెలిపారు. 2019లో చంద్రబాబు ఎవరికి మద్దతిస్తే వారే ప్రధాని అవుతారని డొక్కా జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments