Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పితృ వియోగం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:03 IST)
మాజీ మంత్రి, తెలుగుదేశం నాయ‌కుడు దేవినేని ఉమామహేశ్వర రావు తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కొద్ది సేపటి క్రితం విజయవాడ రమేష్ హాస్పిటల్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న స్వ‌గ్రామం కృష్ణా జిల్లా కంచికచ‌ర్ల‌. ఆయ‌న పెద్ద కుమారుడు, మాజీ మంత్రి దేవినేని ర‌మ‌ణ గ‌తంలో రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. 
 
 
దేవినేని శ్రీమన్నారాయణ మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు కంచికచర్లకు వ‌స్తున్న‌ట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం చంద్రబాబు ఉడండవల్లి లోని ఆయన నివాసం నుండి నేరుగా కంచికచర్ల గొట్టుముక్కల రోడ్డులో దేవినేని ఉమ ఇంటికి వస్తారన్నారు.


అనారోగ్యంతో మృతి చెందిన దేవినేని శ్రీమన్నారాయణ మృతదేహాన్ని చంద్ర‌బాబు సందర్శించి నివాళులు అర్పిస్తారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించనున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. చంద్రబాబు వెంట, మాజీ మంత్రులు పార్టీ ముఖ్య నేతలు కూడా వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments