Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ రిజెక్ట్ చేసినవారే టీడీపీలోకి వెళ్తారు : మాజీ మంత్రి అనిల్

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (14:42 IST)
వచ్చే ఎన్నికల నాటికి అనేక మంది వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపపక్షమైన టీడీపీలోకి వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. తమ పార్టీ తరపున పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ నిరాకరించేవారే తెలుగుదేశం పార్టీలోకి వెళతారని ఆయన చెప్పారు. 
 
ఆయన బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు నగర ప్రజలపై మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణ రూ.1100 కోట్ల అప్పు పెడితే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా అప్పు లేకుండా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పుకునే ధైర్యం టీడీపీ నేతల్లో ఒక్కరికైనా ఉందా అని ఆయన నిలదీశారు. 
 
నెల్లూరు సిటీలో జరిగిన అభివృద్ధిపై ఈ జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు  సిద్ధమని తెలిపారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సినీ స్థానం నుంచి మంత్రి నారాయణ పోటీ చేసినప్పటికీ తాను బరిలో ఉంటానని చెప్పారు. ఇకపోతే, తమ పార్టీ నేతలు వైకాపాలోకి వెళుతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ, సీఎం జగన్ నిరాకరించే వారే టీడీపీలోకి వెళతారని చెప్పారు. రక్తం మరిగినవారు అధికారం కోసం ఎంతటి అడ్డుదారులైనా తొక్కుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments