Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ రిజెక్ట్ చేసినవారే టీడీపీలోకి వెళ్తారు : మాజీ మంత్రి అనిల్

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (14:42 IST)
వచ్చే ఎన్నికల నాటికి అనేక మంది వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపపక్షమైన టీడీపీలోకి వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. తమ పార్టీ తరపున పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ నిరాకరించేవారే తెలుగుదేశం పార్టీలోకి వెళతారని ఆయన చెప్పారు. 
 
ఆయన బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు నగర ప్రజలపై మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణ రూ.1100 కోట్ల అప్పు పెడితే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా అప్పు లేకుండా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పుకునే ధైర్యం టీడీపీ నేతల్లో ఒక్కరికైనా ఉందా అని ఆయన నిలదీశారు. 
 
నెల్లూరు సిటీలో జరిగిన అభివృద్ధిపై ఈ జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు  సిద్ధమని తెలిపారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సినీ స్థానం నుంచి మంత్రి నారాయణ పోటీ చేసినప్పటికీ తాను బరిలో ఉంటానని చెప్పారు. ఇకపోతే, తమ పార్టీ నేతలు వైకాపాలోకి వెళుతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ, సీఎం జగన్ నిరాకరించే వారే టీడీపీలోకి వెళతారని చెప్పారు. రక్తం మరిగినవారు అధికారం కోసం ఎంతటి అడ్డుదారులైనా తొక్కుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments