వ్యాయామం చేస్తుండగా బెణికి కాలు.. సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (13:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కాలు బెణికింది. ఆయన వ్యాయామం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఈ నెల 5వ తేదీన కర్నూలు జిల్లా ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణోత్సవానికి ఆయన హాజరుకావడం లేదు. మంగళవారం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కాలు బెణికడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన తన ప్రయాణం రద్దు చేసుకున్నారు.
 
నోప్పి ఎంతకీ తగ్గకపోగా, సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో బుధవారం ఒంటిమిట్ట ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు గతంలోనూ ఇలాగే కాలికి గాయమైన విషయం తెల్సిందే. 
 
కాగా, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5వ తేదీన ఆయన ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ దర్శనం కోసం వెళ్లాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సివుంది. ఇందుకోసం అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, కాలు బెణకడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకోగా, ఆ మేరకు అధికారులు జిల్లా యంత్రాంగానికి సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments