Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాయామం చేస్తుండగా బెణికి కాలు.. సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (13:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కాలు బెణికింది. ఆయన వ్యాయామం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఈ నెల 5వ తేదీన కర్నూలు జిల్లా ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణోత్సవానికి ఆయన హాజరుకావడం లేదు. మంగళవారం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కాలు బెణికడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన తన ప్రయాణం రద్దు చేసుకున్నారు.
 
నోప్పి ఎంతకీ తగ్గకపోగా, సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో బుధవారం ఒంటిమిట్ట ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు గతంలోనూ ఇలాగే కాలికి గాయమైన విషయం తెల్సిందే. 
 
కాగా, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5వ తేదీన ఆయన ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ దర్శనం కోసం వెళ్లాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సివుంది. ఇందుకోసం అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, కాలు బెణకడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకోగా, ఆ మేరకు అధికారులు జిల్లా యంత్రాంగానికి సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments