Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లని కుర్తా.. నల్లని ప్యాంటులో శాంతి దూతలా జగన్ నయా లుక్.. అదిరిపోయింది గురూ...!!

వరుణ్
మంగళవారం, 2 జులై 2024 (14:02 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్‌లో కనిపించారు. తెల్లని కుర్తా, నల్లని ఫ్యాంటు ధరించి కనిపించారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత మే నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైకాపా చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. గత ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్... పులివెందుల నుంచి తొలుత హైదరాబాద్‌కు అక్కడ నుంచి బెంగుళూరులోని తన ప్యాలెస్‌కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కొత్త లుక్‌లో కనిపించారు. ఈ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెల్లని కుర్తా, బ్లాక్ ప్యాంటులో మెరిసిపోయారు. వారం రోజులుగా బెంగుళూరులోనే ఉంటున్న ఆయన తన ప్యాలెస్‌కు వచ్చే అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఇపుడీ ఫోటోలు సామాజికమాద్యమంలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ ఫోటోలను చూస్తున్న అభిమానులు.. జగన్‌ను ఈ విధంగా ఎన్నడూ చూడలేదని అంటున్నారు. అంతేకాకుండా జగన్ ఓ శాంతిదూతలా కనిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుంటే, జగన్మోహన్ రెడ్డి మంగళవారం బెంగుళూరు నుంచి విజయవాడ తాడేపల్లికి చేరుకోనున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో బెంగుళూరు నుంచి విజయవాడకు వస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments