Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎంగా వుండివుంటే విభజన చేసిన జిల్లాలను మళ్లీ కలిపేవాడిని : నల్లారి

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (09:46 IST)
గత వైకాపా ప్రభుత్వం జిల్లాలను విభజన చేసి తప్పు చేసిందని, ఇపుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే విడదీసిన జిల్లాలను కలిపివుండేవాడినని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం జిల్లాలను విభజించి తప్పు చేసిందన్నారు. తాను కనుక సీఎంగా ఉండివుంటే విడగొట్టిన జిల్లాలను మళ్లీ కలిపేసి వుండేవాడినని చెప్పారు. సమర్థుడైన చంద్రబాబు ఏపీకి మళ్లీ ముఖ్యమంత్రి కావడం సంతోషమన్నారు. చంద్రబాబు ముందు చాలా సవాళ్లు ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వ అండతో పరిష్కరించాలని సూచించారు. 
 
ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనల్లో వాటి పర్యావసానమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తప్పిస్తేనే తెలుగు రాష్ట్రా మధ్య నదీ జలాల సమస్య పరిష్కారమవుతుందని కిరణ్ కుమార్ చెప్పారు. ఈ ట్రైబ్యునల్‌ తీర్పుపై తాను స్టే తీసుకొచ్చి 11 యేళ్లు అవుతుందని ఆయన గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో అప్రమత్తం కాకుంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments