Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా బాగున్నట్టుగానే కనిపిస్తాది.. కానీ చిత్తుగా ఓడిస్తారు.. జగన్‌కు కేసీఆర్ హెచ్చరిక

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (07:18 IST)
మనకు అంతా బాగున్నట్టుగానే కనిపిస్తుందని, కానీ ఎన్నికల క్షేత్రానికి వెళ్లిన తర్వాత చిత్తుగా ఓడిస్తారని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హితవు పలికారు. 
 
తన ఫామ్‌హౌస్‌లో కాలుజారి పడటంతో తుంటె ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‍ నంది నగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ తీరిగ్గా 20 రోజుల తర్వాత గురువారం కలుసుకుని పరామర్శించారు. ఈ భేటీ ఇటు పరామర్శ.. అటు రాజకీయ కోణంలో జరిగింది. 
 
తనతో వచ్చిన వారితో పాటు కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ను కూడా బయటకు పంపి కేసీఆర్, జగన్‌లు మాత్రమే ఓ గంట పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. చుట్టుముడుతున్న సమస్యల నుంచి బయటపడి వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడంపై కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా తెలంగాణాలో బీఆర్ఎస్ ఓటమిని ఊహించలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాగా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదని, ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పినట్టు సమాచారం. 
 
"అంతా బాగుందనుకున్నాం. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక 40 రోజుల్లో పూర్తిగా మార్పు కనిపించింది. ఇది ఊహించని పరిణామం" అని పేర్కొన్నట్టు వినికిడి. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజలు తమ వ్యతిరేకతను ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు బయటపెట్టరు.. జాగ్రత్త" అని జగన్‌ను కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments