Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా తరపున పోటీ చేస్తున్న సీబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణ??

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (12:04 IST)
వచ్చే యేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీబీఐ జాయింట్ డైరెక్టరుగా పని చేసి పదవీ విరమణ పొందిన వివి లక్ష్మీనారాయణ ఏపీలోని అధికార వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ ప్రచారం సాగుతుంది. ఈ తరహా ప్రచారం సాగడానికి కారణం లేకపోలేదు. 
 
ఇటీవల వైకాపా ప్రభుత్వంపై లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి కార్యక్రమమని ఆయన కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా తయారయ్యాయని, అంగన్‌వాడీలో చిన్న పిల్లలకు రాగిజావ ఇవ్వడం గొప్ప నిర్ణయమని చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికలు వైకాపా తరపున పోటీ చేయబోతున్నారనే  ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ ఊహాగానాలతో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి వార్తలపై చర్చిస్తూ ప్రజలు అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తాను వైకాపాలో చేరడం లేదని  స్పష్టం చేశారు. ఓటర్లను చైతన్యం చేసే తన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments