Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా తరపున పోటీ చేస్తున్న సీబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణ??

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (12:04 IST)
వచ్చే యేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీబీఐ జాయింట్ డైరెక్టరుగా పని చేసి పదవీ విరమణ పొందిన వివి లక్ష్మీనారాయణ ఏపీలోని అధికార వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ ప్రచారం సాగుతుంది. ఈ తరహా ప్రచారం సాగడానికి కారణం లేకపోలేదు. 
 
ఇటీవల వైకాపా ప్రభుత్వంపై లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి కార్యక్రమమని ఆయన కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా తయారయ్యాయని, అంగన్‌వాడీలో చిన్న పిల్లలకు రాగిజావ ఇవ్వడం గొప్ప నిర్ణయమని చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికలు వైకాపా తరపున పోటీ చేయబోతున్నారనే  ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ ఊహాగానాలతో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి వార్తలపై చర్చిస్తూ ప్రజలు అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తాను వైకాపాలో చేరడం లేదని  స్పష్టం చేశారు. ఓటర్లను చైతన్యం చేసే తన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments