Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా తరపున పోటీ చేస్తున్న సీబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణ??

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (12:04 IST)
వచ్చే యేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీబీఐ జాయింట్ డైరెక్టరుగా పని చేసి పదవీ విరమణ పొందిన వివి లక్ష్మీనారాయణ ఏపీలోని అధికార వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ ప్రచారం సాగుతుంది. ఈ తరహా ప్రచారం సాగడానికి కారణం లేకపోలేదు. 
 
ఇటీవల వైకాపా ప్రభుత్వంపై లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి కార్యక్రమమని ఆయన కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా తయారయ్యాయని, అంగన్‌వాడీలో చిన్న పిల్లలకు రాగిజావ ఇవ్వడం గొప్ప నిర్ణయమని చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికలు వైకాపా తరపున పోటీ చేయబోతున్నారనే  ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ ఊహాగానాలతో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి వార్తలపై చర్చిస్తూ ప్రజలు అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తాను వైకాపాలో చేరడం లేదని  స్పష్టం చేశారు. ఓటర్లను చైతన్యం చేసే తన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments