Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాలి: ఏపి గ‌వ‌ర్న‌ర్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (19:49 IST)
వేగంగా మారుతున్న వాతావరణ పరిస్ధితులను మెరుగు పరిచి, కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు.

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం రాజ్ భవన్ ప్రాంగణంలో గవర్నర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తనకు మొక్కల పెంపకం పట్ల మంచి ఆసక్తి ఉందని, ఏ కార్యక్రమానికి వెళ్లినా తాను మొక్కలు నాటేందుకు తొలి ప్రాధన్యత ఇస్తానని వెల్లడించారు.

పచ్చదనం పెంపుకు దోహద పడాలని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారని, ప్రజలు తదనుగుణంగా స్పందిస్తూ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. రాజ్ భవన్ ప్రాంగణంలో ఉసిరి, తులసి మొక్కలను నాటిన గవర్నర్ ఔ షధ గుణాలు కలిగిన ఈ మొక్కలు భారతదేశానికి ప్రాముఖ్యమైనవని, వాటిని వాతావరణ మార్పుల వల్ల అంతరించి పోకుండా కాపాడాలని కోరారు.

కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments