Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాలి: ఏపి గ‌వ‌ర్న‌ర్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (19:49 IST)
వేగంగా మారుతున్న వాతావరణ పరిస్ధితులను మెరుగు పరిచి, కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు.

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం రాజ్ భవన్ ప్రాంగణంలో గవర్నర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తనకు మొక్కల పెంపకం పట్ల మంచి ఆసక్తి ఉందని, ఏ కార్యక్రమానికి వెళ్లినా తాను మొక్కలు నాటేందుకు తొలి ప్రాధన్యత ఇస్తానని వెల్లడించారు.

పచ్చదనం పెంపుకు దోహద పడాలని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారని, ప్రజలు తదనుగుణంగా స్పందిస్తూ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. రాజ్ భవన్ ప్రాంగణంలో ఉసిరి, తులసి మొక్కలను నాటిన గవర్నర్ ఔ షధ గుణాలు కలిగిన ఈ మొక్కలు భారతదేశానికి ప్రాముఖ్యమైనవని, వాటిని వాతావరణ మార్పుల వల్ల అంతరించి పోకుండా కాపాడాలని కోరారు.

కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments