Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్న భోజనంలో కొత్త రుచి... కొత్త మెనూ ఇదీ

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (11:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ఇపుడు సరికొత్త రుచిని సంతరించుకోనుంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఒకేవిధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా, పులివెందులలో తిన్నా, అమరావతిలో తిన్నా రుచి మారకూడదు. నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దు అని ఆయన ఆదేశించారు. శనివారం విద్యాశాఖ కార్యకలాపాలపై సమీక్షించిన సీఎం జగన్‌.. అధికారులకు పలు సూచనలు చేశారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ నెల 21 నుంచి భోజనంలో కొత్త మెనూ అమలు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కొత్త మెనూ అమలు నిమిత్తం ప్రస్తుతం చెల్లిస్తున్న ఖర్చులకు అదనంగా ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలకు 43 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 40 పైసల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు.
 
కొత్త మెనూ ఇదీ
సోమవారం: అన్నం, పప్పుచారు, గుడ్డుతో కూర, చిక్కీ
మంగళవారం: పులిహోర, టమాటా పప్పు, గుడ్డు
బుధవారం: కూరగాయలతో అన్నం, బంగాళా దుంప కుర్మా, గుడ్డు, చిక్కీ
గురువారం: కిచిడీ(పెసరపప్పు అన్నం), టమాటా చెట్నీ, గుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, చిక్కీ
శనివారం: అన్నం, సాంబారు, పొంగలి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments