Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:50 IST)
ఏపీలోని అన్ని డిగ్రీ కళాశాలల్లోనూ ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. ఇంజనీరింగ్‌, వైద్య విద్య కళాశాలల మాదిరిగానే సాధారణ డిగ్రీ కాలేజీల్లోనూ ఇంగ్లీషులోనే బోధన జరగాలని, ఇంగ్లీషు మాధ్యమం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన కోర్సులను ప్రణాళికా బద్ధంగా తీసుకురావాలని సూచించారు.

డిగ్రీ మొదటి ఏడాదిలోనే దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశ పెట్టాలని తెలిపారు. అలాగే 11, 12 తరగతుల్లో కూడా ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టాలని సూచించారు. ఒకేసారి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బందులు రాకుండా పాఠ్యపుస్తకాలన్నీ ఇంగ్లీషు, తెలుగుమాధ్యమాల్లో ముద్రించాలని ఆదేశించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని సీఎం చెప్పారు. బీఏ, బీకాం లాంటి కోర్సులు చేసి.. ఇంగ్లీషులో మాట్లాడలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పోటీ ప్రపంచంలో రాణించడం కష్టం అవుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలను కల్పించే పాఠ్యప్రణాళికను రూపొందించాలని సీఎం ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. ఆరేళ్ల నుంచి ఇదే తంతు

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments