Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో నురగలు కక్కుతూ పడిపోతున్న జనం: రేపు కేంద్ర వైద్యబృందం రాక

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (18:46 IST)
ఇప్పుడు ఏలూరులో ఏం జరుగుతోందో తెలియక జనం బెంబేలెత్తిపోతున్నారు. అస్సలు అంతు చిక్కని వ్యాధి పశ్చిమ గోదావరిజిల్లా ప్రజలను వణికిస్తోంది. జనం ఉన్నట్లుండి నోట్లో నుంచి నురగలు కక్కుతూ వాంతులు చేసుకోవడం, విరోచనాలు అవుతూ చనిపోతుండటం..ఇలా అంతు చిక్కని వ్యాధి ఏంటో జనానికి అస్సలు అర్థం కావడం లేదు. 
 
తాజాగా ఆఫీసుల్లో పనిచేస్తున్న వారు స్పృహ తప్పి పడిపోతుండటం కూడా ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇదేమైనా కరోనావైరస్ ఏమోనని ముందుగా పరీక్ష చేయించారు. అందరికీ నెగిటివ్ వచ్చింది. మళ్ళీ నీటిని పరిశీలించారు. నీటిలో ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చారు. అసలు సమస్య ఎక్కడుందో.. జనం ఎందుకు ఇలా పడిపోతున్నారో తెలియక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఈ వ్యాధి ఏమిటో కనుక్కోలేకపోవడంతో ఇక కేంద్రమే రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ మేరకు కేంద్ర వైద్య బృందం రంగంలోకి దిగనుంది. అత్యవసరంగా ఈ బృందం ఏలూరుకు రానుంది. 
 
రేపు ప్రజల ఆకస్మిక అనారోగ్యంపై విచారణ చేయనుంది కేంద్ర వైద్య బృందం. ఈ బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రొఫెసర్ అవినాష్, వైరాలజిస్ట్ సంకేత్ కులకర్ణిలు ఉండనున్నారు. వీరు రేపు ఉదయం పరిశీలన జరిపి రేపు సాయంత్రం లోగా ప్రాథమిక నివేదికను సమర్పించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

జాబిలమ్మ నీకు అంతా కోపమా సినిమాని సపోర్ట్ చేయండి : జాన్వీ నారంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments